Tuesday, September 17, 2024
HomeతెలంగాణHyd: ఈటల, రేవంత్ ఇద్దరూ ఒకటే: కౌశిక్ రెడ్డి

Hyd: ఈటల, రేవంత్ ఇద్దరూ ఒకటే: కౌశిక్ రెడ్డి

ఈటల రాజేందర్- రేవంత్ రెడ్డి ఇద్దరూ ఒక్కటే అంటూ మండిపడ్డారు ప్రభుత్వ విప్ పాడి కౌశిక్ రెడ్డి. ఈటల రాజేందర్, రేవంత్ రెడ్డి దొంగ నాటకాలు ఆడుతున్నారని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. BRS పార్టీ ఒక్క రూపాయి ఇవ్వలేదని రేవంత్ రెడ్డి భాగ్యలక్ష్మి దేవాలయం సాక్షిగా ప్రమాణం చేశారని, ఈటెల రాజేందర్ రేవంత్ రెడ్డికి డబ్బులు ఇచ్చాడని ఆనాడు నేను చెప్పానంటూ కౌశిక్ గతం గుర్తుచేసే ప్రయత్నం చేశారు. ఇవ్వాళ ఈటల రాజేందర్ వ్యాఖ్యలపై స్పందించిన రేవంత్, ఆనాడు నేను చేసిన వ్యాఖ్యలపై ఎందుకు స్పందించలేదని నిలదీశారు. ఈటల రాజేందర్ ను నేను ఉన్నది ఉన్నట్లు అడుగుతుంటే ఎందుకు అంగీ, లాగు చించుకుంటున్నారు? వేం నరేందర్ కొడుకు పెళ్లిలో హుజురాబాద్ ఎన్నికల డీల్ కుదిరించుకుంది నిజం కాదా? 25కోట్ల డబ్బులు లెజెండ్ రెస్టారెంట్ లో డబ్బులు మార్చుకుంది నిజం కాదా? హుజురాబాద్ ఇల్లంతకుంట రాముడి గుడి సాక్షిగా ప్రమాణం చేద్దామా? టైం ఈటెల రాజేందర్ చెప్పినా సరే …నన్ను చెప్పామన్నా సరే అంటూ ఆయన సవాలు చేశారు.

- Advertisement -

హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఈటెల రాజేందర్ 25కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డికి ఇచ్చారని, రేవంత్ రెడ్డికి, ఈటెల రాజేందర్ కు తేడాలు రావడంతో మనసులో మాట బయటపడిందని కౌశిక్ ఆరోపించారు. బీజేపీ పార్టీలోని నేతల మధ్య అంతర్గత కలహాలు ఉన్నాయని, ఈటెల రాజేందర్ చేరికల కమిటీ చైర్మన్ కాదు..బ్రోకర్ల కమిటీ చైర్మన్ అంటూ ఆరోపించారుయ ఇద్దరు దొంగలు దొంగా దొంగ అనుకుంటున్నారని, ఈటెల రాజేందర్ బీజేపీకి, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సేల్స్ CEOలుగా వ్యవహరిస్తున్నారని కౌశిక్ ధ్వజమెత్తారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News