Thursday, July 4, 2024
HomeతెలంగాణHyd: కేసీఆర్ కు మాజీ మంత్రుల పరామర్శ

Hyd: కేసీఆర్ కు మాజీ మంత్రుల పరామర్శ

కేసీఆర్ ను కలిసిన వారిలో సబిత, సత్యవతి, బిందు

మాజీ సీఎం కేసీఆర్ ను పరామర్శించారు మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి. హైదరాబాద్ సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ పొందుతున్న మాజీ సీఎం కేసీఆర్ ని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ పరామర్శించారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మహబూబాబాద్ జడ్పీ చైర్ పర్సన్ కుమారి అంగోత్ బిందుతో కలిసి సత్యవతి రాథోడ్ యశోద ఆస్పత్రికి వెళ్లారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కేసీఆర్ తో మాట్లాడిన సత్యవతి రాథోడ్ కి తన ఆరోగ్యం బాగానే ఉందని అందరూ ధైర్యంగా ఉండాలని మాజీ సీఎం కేసీఆర్ తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News