Sunday, November 16, 2025
HomeతెలంగాణHyd: మాగంటి ఆధ్వర్యంలో సిఎం చిత్రపటానికి పాలాభిషేకం

Hyd: మాగంటి ఆధ్వర్యంలో సిఎం చిత్రపటానికి పాలాభిషేకం

మెట్రో విస్తరణ వంటి నిర్ణయాలపై మాగంటి హర్షం

హైదరాబాద్ నగరం నలువైపులా మెట్రో రైల్ విస్తరణకు రూ.69,100 కోట్లు కేటాయించడంతో పాటు ఆర్టిసి కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం హర్షనీయం అని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు మాగంటి గోపినాథ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి, బిఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ పిలుపు మేరకు జూబ్లీహిల్స్ నియోజకవర్గం యూసుఫ్ గూడ చౌరస్తాలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి బాణసంచి కాల్చి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గోపినాథ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ మెట్రో రైల్ విస్తరణ చాల గొప్ప నిర్ణయమని ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యంకోసం నగరం నలుమూల విస్తరించడం నగర ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు రాజకుమార్ పటేల్, దేదీప్య రావు, సిఎన్.రెడ్డి,డివిజన్ అధ్యక్షులు సంజీవ, వేణుగోపాల్ యాదవ్, ప్రదీప్,కృష్ణమోహన్, సంతోష్,నాయకులు విజయకుమార్,చిన్న రమేష్,విజయసింహ, సిరాజ్,షరీఫ్,నజీర్, బషీర్,నర్సింగ్ దాస్, మధు యాదవ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad