Sunday, October 6, 2024
HomeతెలంగాణHyd: పాలకుర్తిలో టూరిజం హోటల్ కు 25 కోట్లు

Hyd: పాలకుర్తిలో టూరిజం హోటల్ కు 25 కోట్లు

పాలకుర్తిలో ఆధ్యాత్మిక, పర్యాటక పాలకుర్తి ప్రాంత అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటూ.. 25 కోట్లు మంజూరు చేసింది. ఈమేరకు పరిపాలనా అనుమతులతో పాటు నిధులు విడుదల చేస్తూ, జీఓ జారీ చేసింది. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్ లకు ఈసందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కృతజ్ఞతలు తెలిపారు.
మంత్రి ఎర్రబెల్లి ప్రాతినిధ్యం వహిస్తున్న పాలకుర్తి నియోజకవర్గ కేంద్రం పాలకుర్తి, పక్క గ్రామాలైన వల్మీడి, బమ్మెర లు ఎంతో చారిత్రాత్మకమైన ప్రాంతాలు, ఈ ప్రాంతాలను అభివృద్ధి చేయాలని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి ప్రత్యేక నిధులతో టూరిజం కారిడార్ ను ఏర్పాటు చేస్తున్నారు. కారిడార్ కేంద్రంగా ఉన్న పాలకుర్తిలో ఒక టూరిజం హోటల్ ఏర్పాటు చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంకల్పించారు. సాధ్యమైనంత త్వరగా ఆ భవనాన్ని నిర్మించాలని ఆదేశిస్తూ తెలంగాణ ప్రభుత్వం 48 జీఓను విడుదల చేసింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News