Saturday, October 5, 2024
HomeతెలంగాణHyd: పెద్దమ్మ గుళ్లో నిరంజన్ రెడ్డి ఆత్మీయ సమ్మేళనం

Hyd: పెద్దమ్మ గుళ్లో నిరంజన్ రెడ్డి ఆత్మీయ సమ్మేళనం

ఆత్మీయులను కలుసుకునేందుకే సమ్మేళనం నిర్వహిస్తున్నట్టు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. అభిమానులను, శ్రేయాభిలాషుల కుటుంబాలను ఒక చోట కలుసుకోవడం సంతోషంగా ఉందన్న మంత్రి నిరంజన్ రెడ్డి.. కరోనా నేపథ్యంలో ఆగిన మొక్కులు అమ్మవారికి చెల్లించునే సంధర్భంగా ఈ సమ్మేళనం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రత్యేక పూజల అనంతరం వనపర్తి నియోజకవర్గ ప్రజలు, హైదరాబాద్ లో నివసిస్తున్న వనపర్తి వాసులతో సమ్మేళనం నిర్వహించారు ఆయన. దాదాపు పదివేల మంది రాకతో కిక్కిరిసింది అమ్మవారి ఆలయ ప్రాంగణం.
ఆత్మీయ సమ్మేళనానికి హాజరైన మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గువ్వల బాలరాజు, జైపాల్ యాదవ్, వీఎం అబ్రహం, బీరం హర్షవర్దన్ రెడ్డి, ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణరెడ్డి, సురభి వాణీదేవి, తక్కెళ్లపల్లి రవీందర్ రావు, మాజీ ఎమ్మెల్యే చల్లా వెంకట్రామ్ రెడ్డి, ఆయిల్ ఫెడ్ చైర్మన్ రామకృష్ణారెడ్డి, అగ్రోస్ చైర్మన్ తిప్పన విజయసింహారెడ్డి, జడ్పీ చైర్మన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, మాజీ కార్పోరేషన్ చైర్మన్లు బండారు భాస్కర్, అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News