Saturday, September 21, 2024
HomeతెలంగాణHyd: హైదరాబాద్ లో రాష్ట్రపతి ముర్ము

Hyd: హైదరాబాద్ లో రాష్ట్రపతి ముర్ము

రాష్ట్రపతి ముర్ముకు ఎయిర్ పోర్ట్ లో ఘనంగా స్వాగతం పలికిన ముఖ్యమంత్రి

హైదరాబాద్ పర్యటనకు వచ్చిన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి సాయంత్రం బేగంపేట్ ఎయిర్ పోర్ట్ లో ఘనంగా స్వాగతం పలికారు ముఖ్యమంత్రి కేసీఆర్. రాష్ట్రపతికి శాలువా కప్పి పూల బొకే అందించి స్వాగతం పలికారు ముఖ్యమంత్రి. సీఎం వెంట మంత్రులు మహమూద్ అలీ , తలసాని శ్రీనివాస్ యాదవ్ , సబితా ఇంద్రారెడ్డి , సత్యవతి రాథోడ్ , సి హెచ్ మల్లారెడ్డి , ఎంపీ లు జోగినపల్లి సంతోష్ కుమార్ , వెంకటేష్ నేత , ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి , మధుసూదనా చారి , నవీన్ కుమార్ , ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి , డీజీపీ అంజనీ కుమార్ , మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News