Friday, September 20, 2024
HomeతెలంగాణHyd: భూసార పరిరక్షణ ప్రభుత్వ ధ్యేయం

Hyd: భూసార పరిరక్షణ ప్రభుత్వ ధ్యేయం

65 శాతం సబ్సిడీపై రూ.76.66 కోట్లు భారం భరించి పచ్చి రొట్ట విత్తనాలు సరఫరా చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి భూసార పరిరక్షణ ధ్యేయమంటూ వివరించారు అధికారులు. 1445 డీసీఎంస్, పీఎసీఎస్ , గుర్తింపబడిన అగ్రో రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులో విత్తనాలుంటాయని, లక్ష 46 వేల క్వింటాళ్ల విత్తనాలు పంపిణీకి సిద్దమయ్యాయని సంబంధింత అధికారులు తేటతెల్లం చేశారు. పచ్చి రొట్ట ఎరువులతో నాణ్యమైన, ఆరోగ్యవంతమైన పంట దిగుబడులు వస్తాయని, రైతులను పచ్చి రొట్ట ఎరువుల వినియోగంపై నిరంతరం చైతన్యం కావాలన్నారు.

- Advertisement -

విచక్షణారహితంగా రసాయనిక ఎరువుల వాడకం ద్వారా నేలల సహజ స్వభావం దెబ్బతింటున్నది .. భూమి నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం కోల్పోతున్నది .. చౌడు శాతం పెరిగిపోతున్నదని వారు హెచ్చరించారు. రాష్ట్రంలో, దేశంలో నేలలో సేంద్రియ కర్భనం తగ్గిపోతూ వస్తున్నది .. అది కనీసం ఒకశాతం కూడా మించి లేదని, అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఇది మూడు శాతానికి పైగా ఉన్నదని, అధిక రసాయనిక ఎరువుల వాడకంతో భూమి పంటల సాగుకు పనికిరాకుండా పోయి రైతుల పెట్టుబడి ఖర్చు పెరిగినా దిగుబడులు రాక నష్టపోతున్నారని హెచ్చరించారు.

నేలల పునరుజ్జీవనానికి రైతులు సేంద్రీయ ఎరువులకు ప్రాధాన్యం ఇవ్వాలని, పశువులు, కోళ్లు ,గొర్రెలు, వర్మి కంపోస్ట్ ఎరువుల వాడకం రైతులకు భారంగా మారిందన్నారు. పచ్చిరొట్ట పైర్లయిన జీలుగ, పిల్లిపెసర, జనుము సాగుచేసి రైతులు నేలలో కలియదున్నాలని, మే రెండవ వారం నుండి జూన్ రెండవ వారం లోపు పచ్చిరొట్ట విత్తనాలు రైతులు విత్తుకోవాలని సూచించారు. వీటి సాగుమూలంగా భాస్వరం, గంధకం పోషకాలు గణనీయంగా పెరగడంతో పాటు నత్రజని వాడకం 25 నుండి 30 శాతం తగ్గించవచ్చని, పచ్చిరొట్ట విత్తనాల సాగును ప్రోత్సహించాలని హైదరాబాద్ మంత్రుల నివాస సముదాయంలో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో అధికారులను ఆదేశించిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు , ప్రత్యేక కమిషనర్ హన్మంతు, సీడ్స్ ఎండీ కేశవులు, ఏడీడీ విజయ్ కుమార్ ఈ కార్యక్రమంలో హాజరయ్యారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News