Sunday, October 6, 2024
HomeతెలంగాణHyd: హనుమాన్ శోభాయాత్రను ప్రారంభించిన శంభీపూర్ రాజు

Hyd: హనుమాన్ శోభాయాత్రను ప్రారంభించిన శంభీపూర్ రాజు

బౌరంపేట్ లో హనుమాన్ శోభాయాత్ర ను ప్రారంభించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ప్రారంభించారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బౌరంపేట్ లో భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో జరిగిన హనుమాన్ శోభాయాత్రను ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ప్రారంభించారు.

- Advertisement -

ఈ సందర్భంగా దుర్గామాతను ఆయన దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ మిద్దెల బాల్ రెడ్డి, కౌన్సిలర్ శ్రీనివాస్ రెడ్డి, నాయకులు బెంబడి బుచ్చిరెడ్డి, దర్శన్ రెడ్డి, మురళి యాదవ్, విష్ణు వర్ధన్ రెడ్డి, ఆకుల యాదయ్య, బైండ్ల గోపాల్, ఆకుల బాబు, పార్టీ శ్రేణులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News