Saturday, October 5, 2024
HomeతెలంగాణHyd: తెలంగాణ ఒక శక్తిగా ఎదిగింది

Hyd: తెలంగాణ ఒక శక్తిగా ఎదిగింది

దేశంలో తెలంగాణ ఒక శక్తిగా ఎదిగింది అని సనత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ కొలను లక్ష్మీ బాల్ రెడ్డి అన్నారు. రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశాల మేరకు బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ పార్టీ 23వ ఆవిర్భావ దినోత్సవాలను పురస్కరించుకొని జెండా ఆవిష్కరణ జరుపుతున్నామని చెప్పరు. సీఏం కేసీఆర్ పాలనలో దేశమంతా తెలంగాణ వైపు చూస్తుందని పేర్కొన్నారు వచ్చే ఎన్నికల్లో కూడా ప్రజలు తమకే పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు. అఖండ విజయంతో మూడోసారి కేసీఆర్ సీఏం అవుతారని అన్నారు. రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కొన్ని వందల కోట్లతో సనత్ నగర్ నియోజకవర్గాన్ని అభివృద్ది చేసి చూపించారని కొనియాడారు. అటువంటి బిఆర్ఎస్ పార్టీ సభ్యురాలిగా గర్వ పడుతున్నాను అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ డివిజన్ అధ్యక్షుడు కొలను బాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఫాసిల్, నాయకులు మల్లారెడ్డి, సరాఫ్ సంతోష్, ఖలీల్ బెగ్, కరుణాకర్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, సురేందర్ సింగ్, శ్రీకాంత్, బాషా, బాలు, వసీం, జమీర్ బెగ్, సురేందర్ గౌడ్, షోయబ్, పుష్పాలత, పద్మ, మల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News