Friday, September 20, 2024
HomeతెలంగాణHyd: సచివాలయ ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన ప్రశాంత్ రెడ్డి, ఎర్రబెల్లి

Hyd: సచివాలయ ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన ప్రశాంత్ రెడ్డి, ఎర్రబెల్లి

ఈనెల 30 వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్న డా. బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం భవనాన్ని రాష్ట్ర మంత్రి ప్రశాంత్ రెడ్డి తో కలిసి పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎలక్ట్రిక్ వాహనంలో మంత్రులు ఇద్దరు కలిసి సచివాలయాన్ని కలియ తిరిగి పరిశీలించారు. అలాగే భవనం లోపల కూడా పరిశీలించారు. అనంతరం మంత్రులు మాట్లాడుతూ, సీఎం కెసిఆర్ గారు తెలంగాణ సచివాలయంను అద్భుతంగా తీర్చిదిద్దారు. దేశంలోనే గొప్ప కట్టడంగా రూపు దిద్దుకుంది అని అభివర్ణించారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరు పెట్టడం బాగుందని, ఇలాగే పార్లమెంటు కు అంబేద్కర్ పేరు పెట్టాలని మంత్రులు డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News