Friday, September 20, 2024
HomeతెలంగాణHyd: అకాల వర్షం పంట నష్ట పరిశీలనకు మంత్రులు

Hyd: అకాల వర్షం పంట నష్ట పరిశీలనకు మంత్రులు

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలమేరకు అకాలవర్షం, వడగళ్ల వానతో జరిగిన పంట నష్టాన్ని మంత్రులు పరిశీలించారు. వికారాబాద్ జిల్లా పర్యటనకు బేగంపేట విమానాశ్రయం నుండి హెలికాప్టర్ లో బయలు దేరి రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, విద్యా శాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు తదితరులు బయలుదేరారు.

- Advertisement -

అకాలవర్షం, వడగళ్ల వానతో వికారాబాద్ జిల్లా మర్పల్లి, మోమిన్ పేట మండలాలలోని 13 గ్రామాలలో ఉద్యాన, వ్యవసాయ పంటలకు నష్టం జరిగింది. మామిడి, గులాబీ, ఉల్లిగడ్డ, బొప్పాయి వంటి ఉద్యాన, కొంతమేర మొక్కజొన్న వంటి వ్యవసాయ పంటలు దెబ్బతినటంతో ప్రత్యక్షంగా పంటనష్టం తీవ్రతను పరిశీలించి రైతులకు భరోసా కల్పించేందుకు వీరు పర్యటిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులతో పాటు ఆయా నియోజకవర్గాల శాసనసభ్యులు పర్యటనలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News