Saturday, April 12, 2025
HomeతెలంగాణHyd: ప్రారంభమైన యాదాద్రి అఖండ జ్యోతి యాత్ర

Hyd: ప్రారంభమైన యాదాద్రి అఖండ జ్యోతి యాత్ర

యాదాద్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా అఖండ జ్యోతి యాత్ర హైదరాబాద్ యాదగిరి భవన్ నుండి ప్రారంభమైంది . ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ లు పాల్గొని పూజలు చేశారు. ఆలయ ఛైర్మన్ నరసింహమూర్తి , ప్రధాన అర్చకులు నల్లతీగల్ లక్ష్మీ నరసింహ చార్యులు ఇతర అర్చక బృందం పాల్గొన్నారు . ఈ సందర్భంగా ప్రత్యేక వాహనంలో ఈ జ్యోతి యాత్ర రానుంది. ఆలయ అర్చక స్వాములు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం 29వ అఖండ జ్యోతి యాత్ర కార్యక్రమానికి శ్రీకారం చెప్పారు. బ్రహ్మోత్సవాల ప్రారంభం 21వ తేదీ వరకు అఖండ జ్యోతి యాత్ర యాదగిరిగుట్టకు చేరుకుంటుంది. గ్రామ గ్రామాన భజనలు, డప్పు చప్పుళ్ళు, మంగళ హారతులతో అఖండ జ్యోతి యాత్రకు భక్తులు స్వాగతం పలుకుతారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News