Saturday, November 15, 2025
HomeతెలంగాణSmita Sabharwal : కాళేశ్వరం వివాదం: హైకోర్టును ఆశ్రయించిన ఐఏఎస్ స్మితా సభర్వాల్

Smita Sabharwal : కాళేశ్వరం వివాదం: హైకోర్టును ఆశ్రయించిన ఐఏఎస్ స్మితా సభర్వాల్

Smita Sabharwal : తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు అంశం ఇప్పుడు న్యాయపోరాటానికి దారితీసింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదికను సవాల్ చేస్తూ సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సభర్వాల్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనపై కమిషన్ ఇచ్చిన నివేదికను కొట్టివేయాలని కోరుతూ ఆమె పిటిషన్ దాఖలు చేశారు.

- Advertisement -

కమిషన్ నివేదిక ఆధారంగా తనపై తదుపరి చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని ఆమె కోర్టును కోరారు. గతంలో ఎస్కే జోషికి ఇచ్చిన మాదిరిగానే తనకు కూడా ఊరట లభిస్తుందని ఆమె భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ పిటిషన్ హైకోర్టు రిజిస్ట్రీ పరిశీలనలో ఉంది. పరిశీలన పూర్తయిన తర్వాత దీనిపై విచారణ జరిగే అవకాశం ఉంది.

కమిషన్ నివేదికలో ఏముంది?

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అక్రమాలపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం పీసీ ఘోష్ కమిషన్ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ తన నివేదికలో ప్రాజెక్టు నిర్మాణంలో పాలుపంచుకున్న పలువురు అధికారుల పాత్రపై అనుమానాలు వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే స్మితా సభర్వాల్‌తో పాటు మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, నీటిపారుదల శాఖ మాజీ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ తదితరులకు కమిషన్ నోటీసులు జారీ చేసింది. కమిషన్ ముందు హాజరై తమ వాంగ్మూలాలను నమోదు చేసుకోవాలని సూచించింది.

ఎస్కే జోషికి ఊరట

ఈ వ్యవహారంలో ఇప్పటికే మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి హైకోర్టును ఆశ్రయించారు. కమిషన్ నివేదిక ఆధారంగా తనపై ఎలాంటి చర్యలు తీసుకోరాదంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయనకు ఊరట లభించినట్లయింది. ఇదే తరహాలో స్మితా సభర్వాల్ కూడా కోర్టులో తన వాదనలు వినిపించనున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad