Friday, September 20, 2024
HomeతెలంగాణIbrahimpatnam: 12.64కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన

Ibrahimpatnam: 12.64కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన

శంకుస్థాపన చేసిన కిషన్ రెడ్డి

ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పెద్దఅంబర్ పేట్ మున్సిపాలిటీ కేంద్రంలో చెక్ పోస్ట్ నుండి సాగర్ రోడ్డు వెళ్లే దారిలో (చాకరి వాగు, చెన్న వాగు వద్ద) 5.45 కోట్ల రూపాయల నిధులతో నిర్మించనున్న హైలెవల్ బ్రిడ్జ్ కు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. పెద్దఅంబర్ పేట్ మున్సిపల్ కేంద్రం నుండి పసుమాముల వరకు 4.50 రూపాయల కోట్ల నిధులతో నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అలాగే తట్టిఅన్నారంలోని పలు కాలనీల్లో నిర్మించనున్న 1.38 కోట్ల రూపాయల నిధులతో సీసీ రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. కుంట్లూర్ లో 1.31కోట్ల రూపాయల నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్లు & వరద నీటి కాలువల పనులకు ఎమ్మెల్యే కిషన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్, కౌన్సిలర్లు, కమిషనర్, వివిధ అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News