Saturday, September 7, 2024
HomeతెలంగాణIllanthakunta: ఉద్యోగాల పేరిట మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

Illanthakunta: ఉద్యోగాల పేరిట మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసిన వ్యక్తిని బుధవారం రోజు పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ పంపారు. వల్లంపట్ల గ్రామానికి చెందిన కీసర రవి కుమారుడు కీసర నాగరాజు అనే వ్యక్తి డిగ్రీ పూర్తి చేసుకొని అదే గ్రామంలో కిరాణా షాప్ పెట్టుకొని జీవిస్తున్నాడు. జాబ్ నిమిత్తం వెతుకగా ఇదే మండలానికి చెందిన చిక్కుడువానిపల్లె గ్రామానికి చెందిన కంకటి రవి అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. ఇతడు ఇల్లంతకుంటలో ముద్ర కోపరేట్ సొసైటీలో రవి మేనేజర్ గా పని చేస్తున్న సమయంలో నాగరాజుకు మంచి ఉద్యోగం పెట్టిస్తా అని నమ్మబలికి అతని దగ్గర నుండి 4 లక్షల రూపాయలు తీసుకొన్నాడు.విఎస్విపి ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ లో జాబ్ ఇప్పిస్తా అని పెట్టగా,మళ్ళీ స్వర్ణ భారతి కోపరేటివ్ సొసైటీ చిన్నకోడూరులో జాబ్ పెట్టిస్తా నకిలీ అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చి మోసం చేశాడు.మొత్తం 4 లక్షలు తీసుకొని మోసం చేశాడు.ఉద్యోగాల పేరిట మోసం వ్యక్తిని బుధవారం రోజు అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపినట్లు ఎస్ శ్రీకాంత్ తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News