Sunday, November 16, 2025
HomeతెలంగాణIllanthakunta: ప్రెస్ క్లబ్ భవనానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే కవ్వంపల్లి

Illanthakunta: ప్రెస్ క్లబ్ భవనానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే కవ్వంపల్లి

కవ్వంపల్లిని సన్మానించిన

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో ప్రెస్ క్లబ్ భవన నిర్మాణం కోసం స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ స్థలం కేటాయించి, కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు, ప్రభుత్వానికి వారిధిలా వ్యవహరించే పాత్రికేయుల కోసం తమ ప్రభుత్వం ఎల్లవేళలా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. అనంతరం ప్రెస్ క్లబ్ సభ్యులు ఎమ్మెల్యే కవ్వంపల్లిని ఘనంగా శాలువాతో సత్కరించి ధన్యవాదములు తెలియజేశారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఉట్కూరు వెంకటరమణారెడ్డి, యువజన సంఘ సభ్యులు, ప్రెస్ క్లబ్ ఉమ్మడి అధ్యక్షుడు తూముకుంట శ్రీనివాస్ రెడ్డి, యూనియన్ల అధ్యక్షులు మారుపాక అనిల్ కుమార్, బొల్లం పర్శరాం, సీనియర్ పాత్రికేయులు, యూనియన్ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad