Thursday, September 19, 2024
HomeతెలంగాణGarla: విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేత

Garla: విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేత

10వ తరగతి స్టూడెంట్స్ కు స్టడీ మెటీరియల్

విద్యార్థులు కష్టపడి చదివి మంచి మార్కులతో పాసై, ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్ట్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గంగావత్ వెంకన్న అన్నారు. గార్ల మండల పరిధిలోని ముల్కనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2023 24 సంవత్సరానికి గాను 10వ తరగతి విద్యార్థులు 20 మందికి 7000 రూపాయల విలువగల స్టడీ మెటీరియల్ ను ఉచితంగా పంపిణీ చేశారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సంవత్సరం పదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఉత్తమమైన ఫలితాలు సాధించడానికి ఈ స్టడీ మెటీరియల్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. విద్యార్థులపై ఉన్న మక్కువ కారణంగా ఈ మెటీరియల్ కు సొంత నిధులు సుమారు ఏడు వేల రూపాయలు వెచ్చించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు ఎం శివ నాయక్ ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కుటుంబరావు ఉపాధ్యాయులు షరీఫ్ శంకర్ వెంకన్న రాజు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News