Saturday, October 5, 2024
HomeతెలంగాణJukkal: జోరందుకున్న కారు ప్రచారం

Jukkal: జోరందుకున్న కారు ప్రచారం

గులాబీ మయంగా గ్రామాలు

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని పలు గ్రామాలలో భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యే అభ్యర్థి హన్మంత్ షిండే జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి మేమే చేశామని మరోసారి అధికారంలోకి వచ్చేది మా ప్రభుత్వమేనని పేర్కొన్నారు. కెసిఆర్ చేసిన అభివృద్ధి గురించి చెబితే ఒక రోజు సరిపోదని, పనిచేసే ప్రభుత్వమే కానీ మాటలు చెప్పే ప్రభుత్వం కాదన్నారు. ఎన్నికల సమయం వచ్చింది కాబట్టి అనేక పార్టీ వారు వచ్చి మాయమాటలు చెబుతారని వారిని నమ్మరాదని తెలిపారు. కారు గుర్తుకు ఓటేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో ఎంపీపీ అశోక్ పటేల్, మార్కెట్ కమిటీ చైర్మన్ నాగ్నాథ్ పటేల్, పార్టీ అధ్యక్షుడు వెంకట్ రావు దేశాయి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News