Friday, September 20, 2024
HomeతెలంగాణCongress Bus yatra: సుజిత్ రావు నివాసంలో ఉత్తమ్, కోమటిరెడ్డిల విందు

Congress Bus yatra: సుజిత్ రావు నివాసంలో ఉత్తమ్, కోమటిరెడ్డిల విందు

మల్లాపూర్ లో ఇప్పుడిదే హాట్ టాపిక్

తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బస్ యాత్ర జగిత్యాల జిల్లాలో బస్ యాత్ర బాగా సాగుతోంది. ఏఐసీసీ అగ్రనాయకులు రాహుల్ గాంధీ పాల్గొంటున్నారు. రాహుల్ తో పాటు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు బస్ యాత్రలో పాల్గొంటున్నారు. కాంగ్రెస్ ఎంపిలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు రాహుల్ గాంధితో పాటు యాత్రలో పాల్గొన్నారు. టీపీసీసీ డెలిగేట్ సభ్యులు కల్వకుంట్ల సుజిత్ రావు కాంగ్రెస్ ఎంపిలను తన నివాసానికి విందుకు ఆహ్వానించారు. మెట్ పల్లిలోని సుజిత్ రావు నివాసంలో ముగ్గురు ఎంపిలు భోజనం చేశారు. భోజన అనంతరం కాంగ్రెస్ కార్యకర్తలతో ఎంపిలు నియోజకవర్గ రాజకీయాలపై చర్చించారు. ఇద్దరు ఎంపిలు, ఒక మాజీ ఎంపి సుజిత్ రావు నివాసంలో విందు చేయడం నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News