Wednesday, April 9, 2025
HomeతెలంగాణThangallapalli: హస్తం గూటికి బిఆర్ఎస్ ఎంపిటిసి

Thangallapalli: హస్తం గూటికి బిఆర్ఎస్ ఎంపిటిసి

ఎంపీటీసీతో పాటు 40 మంది..

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం చీర్లవంచ ఎంపీటీసీ నలువాల రేణుక జలంధర్ రెడ్డి జెడ్పీటీసీ పుర్మాని మంజుల లింగారెడ్డి ఆధ్వర్యంలో సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఎంపీటీసీతో పాటు దాదాపు 40 మంది హస్తం గూటికి చేరినట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. కేకే వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎంపిటిసి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వైద్య శివప్రసాద్, చిన్నలింగాపూర్ ఎంపీటీసీ బైరినేని రాము, సూర దేవరాజు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News