Sunday, October 6, 2024
HomeతెలంగాణThangallapalli: మానవత్వం చాటుకున్న ఎస్సై సుధాకర్

Thangallapalli: మానవత్వం చాటుకున్న ఎస్సై సుధాకర్

దగ్గరుండి దహన సంస్కారాలు..

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రానికి చెందిన వెంగల లక్ష్మి శుక్రవారం అనారోగ్యంతో మృతిచెందగా తంగళ్ళపల్లి ఎస్సై సుధాకర్ 5 వేల నగదు అందజేసి, దగ్గర ఉండి దహన సంవత్సరాలు నిర్వహించి మానవత్వం చాటుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.. మృతురాలు వెంగల లక్ష్మికి ఎవ్వరూ లేకపోవడంతో ఓ చెట్టు కింద ఉంచి దహన సంస్కారాలు జరిపించడానికి దాతల సహాయం కోసం ఎదురుచూస్తున్నారని సోషల్ మీడియా ద్వారా విషయం తెలుసుకున్న తంగళ్ళపల్లి ఎస్ఐ సుధాకర్ మృతదేహం ఉంచిన స్థలానికి వెళ్ళి వారి బంధువులతో మాట్లాడి తక్షణ సాయంగా దహన సంస్కారాలకు రూ. 5000 అందజేశారు. అనంతరం దహన సంస్కారాలకు అవసరమైన కార్యక్రమాలను దగ్గర ఉండి జరిపించారు. ఎస్సై సుధాకర్ కు మృతురాలి బంధువులు, గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News