Tuesday, September 17, 2024
HomeతెలంగాణJadcharla: బిఆర్ఎస్ కి బిగ్ షాక్

Jadcharla: బిఆర్ఎస్ కి బిగ్ షాక్

హస్తం గూటికి ..

పార్లమెంట్ ఎన్నికల వేళ బిఆర్ఎస్ పార్టీకి జడ్చర్లలో భారీ షాక్ తగిలింది. పలువురు ముఖ్య నాయకులు కాంగ్రెస్ గూటికి చేరారు. బిఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కాట్రపల్లి లక్ష్మయ్య, జడ్చర్ల మాజీ సర్పంచ్ లలితమ్మ, మండల మాజీ రైతు సమన్వయ కమిటీ చైర్మన్ జంగయ్య, సీనియర్ నాయకులు నర్సింలు గుప్త, కావేరమ్మ పేటకు చెందిన గజగౌని మహేష్ గౌడ్, బుక్క చెన్నయ్య, సుగుణమ్మ, జావేద్ లతోపాటు 50 మంది కార్యకర్తలు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

- Advertisement -

పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమనే నమ్మకంతో కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. పార్లమెంట్ అభ్యర్థి వంశీచందర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపిస్తామని అన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో పార్లమెంట్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసుకునేందుకు పార్లమెంట్ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డిని గెలిపించేందుకు కృషి చేయాలని అన్నారు.

కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శివసేన రెడ్డి, నాయకులు శివకుమార్, రవిశంకర్, టౌన్ అధ్యక్షులు మీనాజుద్దీన్, నిత్యానందం, అశోక్ యాదవ్, మాలిక్ షాకీర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News