Thursday, September 19, 2024
Homeతెలంగాణ Jadcherla: కాంగ్రెస్ కు పదేపదే షాక్

 Jadcherla: కాంగ్రెస్ కు పదేపదే షాక్

బిఆర్ఎస్ లో చేరిన ఎర్ర శేఖర్

బీఆర్ఎస్ పార్టీతోనే బడుగు బలహీన వర్గాల ఆర్థిక అభ్యున్నతి సాధ్యమవుతుందని జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేకర్ పేర్కొన్నారు. ఆదివారం ఈ మేరకు బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరినట్లు తెలిపారు. ఎర్ర శేఖర్ చేరికతో మహబూబ్ నగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఒక్కొక్కరుగా సీనియర్ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడి.. బీఆర్ఎస్ లో చేరుతున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎంతో బలమైన నేతగా ఉన్న ఎర్ర శేఖర్.. కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. భారత రాష్ట్ర సమితిలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో చేరారు.
గులాబీ కండువా కప్పి.. పార్టీలోకి ఆహ్వనించిన కేటీఆర్.. ఎర్ర శేఖర్ చేరికతో పాలమూరులో బీఆర్ఎస్ మరింత బలోపేతం అవుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్ నాయకత్వంలో పని చేస్తానని ఎర్ర శేఖర్ ప్రకటించారు.
తెలంగాణ ఉద్యమ కాలం నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ తో తనకు గొప్ప అనుబంధం ఉందని ఎర్రశేఖర్ తెలిపారు. గతంలో మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యునిగా ఉన్న కేసీఆర్ తో కలిసి పనిచేసిన విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News