Saturday, October 5, 2024
HomeతెలంగాణJagadish Reddy: లోక్ సభ ఎన్నికల టైంకి బీఆర్ఎస్ శక్తిగా ఎదుగుతుంది

Jagadish Reddy: లోక్ సభ ఎన్నికల టైంకి బీఆర్ఎస్ శక్తిగా ఎదుగుతుంది

లోకసభ ఎన్నికల నాటికి దేశంలో బి ఆర్ ఎస్ పార్టీ బలీయమైన శక్తిగా బి ఆర్ ఎస్ పార్టీ ఆవిర్బవిస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. విజన్ ఉన్న నాయకుడిగా దేశ ప్రజల్లో ముఖ్య lమంత్రి కేసీఆర్ కు ఎనలేని ఆదరణ ఉందని ఆయన పేర్కొన్నారు. శనివారం ఉదయం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆయన మీడియా తో మాట్లాడుతూ మహారాష్ట్ర లో బి ఆర్ ఎస్ నమోదు చేసుకున్న విజయం పై ఆయన స్పందించారు. బి ఆర్ ఎస్ పార్టీ మహరాష్ట్ర లో సృష్టించిన ప్రభుంజనం సెగలు హస్థినను తాకుతున్నాయాన్నారు. ఎత్తుగడలో బాగమే కర్ణాటక ఎన్నికలకు బి ఆర్ ఎస్ దూరంగా ఉన్నదని ఆయన వెల్లడించారు. బి ఆర్ ఎస్ పోటీలో లేక పోవడమే అక్కడ కాంగ్రెస్ గెలుపుకు దోహద పడిందన్న అంశాన్ని విస్మరించరాధన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News