Sunday, July 7, 2024
HomeతెలంగాణJagadish Reddy: లక్ష మందితో లక్ష హారతి, వినూత్నంగా సాగునీటి దినోత్సవం

Jagadish Reddy: లక్ష మందితో లక్ష హారతి, వినూత్నంగా సాగునీటి దినోత్సవం

కాళేశ్వరం జలాలు పారే ఏడూ మండలాల్లోని 126 గ్రామాల్లో లక్ష హారతి, 68 కిలోమీటర్ల మేర సాగనున్న కార్యక్రమం

లక్ష మందితో లక్ష హారతి అనే కార్యక్రమాన్ని వినూత్నంగా నిర్వహిస్తూ సాగునీటి దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు మంత్రి జగదీష్ రెడ్డి. సూర్యాపేట నియోజకవర్గంలో మంత్రి జగదీష్ రెడ్డి, తుంగతుర్తి నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు గాధరి కిశోర్ కుమార్, కోదాడ నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ లు పాల్గొంటారు.

- Advertisement -

కాళేశ్వరం జలాలతో తొలి సారిగా లబ్ది పొందిన సూర్యాపేట జిల్లా రైతాంగం ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలుపుకునేందుకు గాను రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా రైతాంగం వినూత్న మార్గాన్ని ఎంచుకుంది. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సావాలలో బాగంగా ఈ నెల 7 న నిర్వహించ తలపెట్టిన సాగునీటి దినోత్సవాన్ని కాళేశ్వరం జలాలతో లక్షహారతి పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించారు. కాళేశ్వరం జలాలు పారే ఏడూ మండలాల్లోని 126 గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.


నాగరం మండలం ఈటూరు నుండి పెన్పహాడ్ మండలం రావి చేరువు వరకు 68 కిలో మీటర్ల బారునా లక్ష మందితో కాళేశ్వరం జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించేలా కార్యక్రమాన్ని రూపొందించారు. అందుకు అవసరమైన ఏర్పాట్లకు గాను సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక సమీక్షా సమావేశానికి మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, అడిషనల్ కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, నీటి పారుదల అధికారి రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా ప్రభుత్వ యంత్రాంగంతో పాటు ప్రజాప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 68 కిలోమీటర్ల దారి పొడవునా లక్ష మందితో సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు నిర్వహించ తలపెట్టిన కాళేశ్వరం జలాలకు లక్ష హారతి కార్యక్రమం బొడ్డు రాయి పండగను మరిపించేలా ఏర్పాట్లు చేసేలా అధికారులను మంత్రి జగదీష్ రెడ్డి ఆదేశించారు.ప్రతి పావు కిలో మీటరు కు ఒకరు చొప్పున 280 మంది ప్రత్యేక అధికారులను నియమించిన ప్రభుత్వం అడుగడుగునా వైద్య బృందాలను అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంది.ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ యంత్రాంగాన్ని రంగంలోకి దింపగా ఎక్కడి కక్కడే పూర్తి స్థాయిలో భోజనాలు ఏర్పాటు చేశారు.మంచినీటి ఏర్పాట్లలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. ఇప్పటికే బతుకమ్మ, బోనాలతో మంగళ వాయిద్యాలతో ఊరు వాడ కదిలేలా కాళేశ్వరం జలాలతో లబ్ది పొందిన రైతాంగం ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కాళేశ్వరం జలాలతో మొట్ట మొదట లబ్ది పొందిన సూర్యాపేట జిల్లా యావత్ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు చెప్పుకునేందుకు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు ఎక్కడి వారు అక్కడే పాల్గొంటున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News