Thursday, September 19, 2024
HomeతెలంగాణJagityala: రాష్ట్రావతరణ వేడుకల్లో మంత్రి కొప్పుల

Jagityala: రాష్ట్రావతరణ వేడుకల్లో మంత్రి కొప్పుల

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్బంగా రాష్ట్ర సంక్షేమ శాఖా మంత్రి కొప్పుల ఈశ్వర్ జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రాంగణంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జిల్లా ప్రజానీకాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. అంతకు ముందు జగిత్యాల జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ అమరవీరుల స్మారక స్థూపన్ని మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో జగిత్యాల , కోరుట్ల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్, కల్వకుంట్ల విద్యా సాగర్ రావు, జిల్లా పరిషత్ చైర్మన్ దావా వసంత, జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా,కరీంనగర్ జిల్లా సహాకార బ్యాంక్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, గ్రంధాలయ సంస్థ చైర్మన్ చంద్ర శేఖర్ గౌడ్, అడిషనల్ కలెక్టర్ మంద మకరంద్, జిల్లా ఎస్పీ భాస్కర్, ఉన్నతాధికారులు, జిల్లాకు చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News