Monday, April 14, 2025
HomeతెలంగాణJammikunta: జూనియర్ పంచాయతీ కార్యదర్శులను వెంటనే రెగ్యులర్ చేయాలి

Jammikunta: జూనియర్ పంచాయతీ కార్యదర్శులను వెంటనే రెగ్యులర్ చేయాలి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జూనియర్ పంచాయతీ కార్యదర్శులను వెంటనే రెగ్యులర్ చేస్తూ జీవో విడుదల చేయాలని, గత నాలుగు సంవత్సరాల ప్రొబేషన్ కాలాన్ని సర్వీస్ గా గుర్తించాలని డిమాండ్ చేస్తూ జమ్మికుంట ఎంపీడీవో కార్యాలయం ముందు మండల పరిధిలోని జూనియర్ పంచాయతీ కార్యదర్శులు నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ కార్యదర్శుల క్యాడర్ స్ట్రెంత్ ని నిర్ధారిస్తూ ప్రభుత్వ నిర్ణయం తీసుకోవాలన్నారు. మరణించిన జూనియర్ పంచాయతీ కార్యదర్శుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు చేపట్టాలని కోరారు. అర్హులైన సీనియర్ పంచాయతీ కార్యదర్శులకు ప్రమోషన్ కల్పించడం వెంటనే చేపట్టాలన్నారు. 317 జీవో వలన నష్టపోయిన పంచాయతీ కార్యదర్శులకు న్యాయం చేయాలని, పరస్పర బదిలీలకు అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు చెప్పారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు నిరసన దీక్షలు కొనసాగిస్తామన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News