Saturday, October 5, 2024
HomeతెలంగాణJinnaram: అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్టలో గూడెం మహిపాల్ రెడ్డి

Jinnaram: అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్టలో గూడెం మహిపాల్ రెడ్డి

గ్రామీణ ప్రాంతాల్లో ఆధ్యాత్మిక భావాలు పెంపొందించడంలో నూతన దేవాలయాల నిర్మాణాలు దోహదం చేస్తాయని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. జిన్నారం మండల పరిధిలోని ఊట్ల గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ శ్రీ శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో నిర్మించిన విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పటాన్చెరు నియోజకవర్గంలో ఇప్పటివరకు 170 కి పైగా దేవాలయాలను సొంత నిధులతో నిర్మించినట్లు తెలిపారు. భగవంతుడి కరుణాకటాక్షాలతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. అనంతరం స్థానిక ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే జిఎంఆర్ ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్తు వైస్ చైర్మన్ ప్రభాకర్, బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకటేష్ గౌడ్, గ్రామ సర్పంచ్ ఆంజనేయులు, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజా ప్రతినిధులు, బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రాజేష్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News