Sunday, October 6, 2024
HomeతెలంగాణJournalist filed nomination: ఆలేరు అసెంబ్లీ బరిలో శ్రీ వైష్ణవ సామాజిక వర్గం నేత

Journalist filed nomination: ఆలేరు అసెంబ్లీ బరిలో శ్రీ వైష్ణవ సామాజిక వర్గం నేత

నవభారత నిర్మాణ సేవా పార్టీ తరపున నామినేషన్

ఆలేరు అసెంబ్లీ బరిలో శ్రీ వైష్ణవ సామాజిక వర్గానికి చెందిన నేత, సీనియర్ జర్నలిస్టు ఆరుట్ల వేణుగోపాల చార్యులు నిలిచారు. ఆలేరులో నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఆయన రాజపేటలో విలేకరులతో మాట్లాడారు. ఇప్పటివరకు శ్రీ వైష్ణవ సామాజిక వర్గం నుంచి ఎవరు పోటీ చేయకపోవడం విశేషం కాగా సీనియర్ జర్నలిస్టుగా అనేక సంవత్సరాలు యాదగిరిగుట్ట ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గం వ్యాప్తంగా వేణుగోపాలచారులు సేవలు అందించారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఆయనకు సన్నిహితులు మిత్రులు అభిమానులు శ్రీవైష్ణవ సేవ సమైక్య నాయకులు ఆయనకు ఘనస్వాగతం పలికి అభినందించారు. “నవభారత నిర్మాణ సేవా పార్టీ” తనకు బీఫామ్ అందజేయగా ఆ పార్టీ నుండి నామినేషన్ వేసినట్లు ఆరుట్ల వేణుగోపాల్ తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News