Thursday, September 19, 2024
HomeతెలంగాణJukkal: బిచ్కుందలో 4 వరుసల రహదారి విస్తరణ పనులు ప్రారంభం

Jukkal: బిచ్కుందలో 4 వరుసల రహదారి విస్తరణ పనులు ప్రారంభం

బిచ్కుంద మండల కేంద్రంలో రూ. 12కోట్ల నిధులతో నిర్మించనున్న నాలుగు వరుసల రహదారి విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి, జుక్కల్ శాసనసభ్యులు హన్మంత్ షిండే. తెలంగాణ రాష్ట్రంలో రైతులకు అమలవుతున్న పథకాలు, అందుతున్న ప్రయోజనాలు చూసి పక్క రాష్ట్రాల రైతులు ఆశ్చర్యపోతున్నారని వారన్నారు. తమ రాష్ట్రాల ప్రభుత్వాలు రైతుల కోసం ఎలాంటి ప్రయోజనాలనూ కల్పించడం లేదని, పక్కనే ఉన్న కర్నాటక, మహారాష్ట్ర రైతులు, ప్రజాప్రతినిధులు చెబుతున్నారని మంత్రులు అన్నారు. జుక్కల్ నియోజకవర్గంలోని అభివృద్ధి పనుల కోసం ఇంకా రూ. 250 కోట్ల నిధులు కావాలని షిండే కోరగా వారి విజ్ఞప్తిని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News