Sunday, October 6, 2024
HomeతెలంగాణKale Yadayya: శంకర్పల్లి మున్సిపాలిటీని రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతా

Kale Yadayya: శంకర్పల్లి మున్సిపాలిటీని రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతా

25 కోట్లతో శంకర్ పల్లి మున్సిపాలిటీ అభివృద్ధి

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం శంకర్ పల్లి మున్సిపాలిటీ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఐటీ పురపాలక శాఖ మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు సహకారంతో జిల్లా మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాలతో జూలై 14 తారీకునాడు 25 కోట్లు మున్సిపాలిటీ అభివృద్ధి కోసం విడుదల చేశారు.

- Advertisement -

ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్ని వార్డులలో తిరిగి పనులను పరిశీలించారు. ఎక్కడెక్కడ ఏయే పనులు, వార్డులకు నిధులు ఎలా కేటాయించాలని స్థానిక నేతల ద్వారా అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేస్తామని తెలియజేశారు. రాష్ట్రంలోనే శంకర్పల్లి మున్సిపాలిటీ ఆదర్శవంతమైన మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ సాతా విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్ వైస్ చైర్మన్ భానూరి వెంకటరాంరెడ్డి వార్డు కౌన్సిలర్లు స్థానిక నేతలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News