Sunday, July 7, 2024
HomeతెలంగాణKale Yadayya: నా కోసం నెల పనిచేయండి, మీ కోసం 5 ఏళ్లు పనిచేస్తా

Kale Yadayya: నా కోసం నెల పనిచేయండి, మీ కోసం 5 ఏళ్లు పనిచేస్తా

రాష్ట్రంలోని కుటుంబాలన్నిటికీ 5 లక్షల బీమా ఫ్రీ

శంకర్ పల్లి మండలం పిల్లిగుండ్ల, గోపులారం, మిర్జగుడా, ఇంద్రారెడ్డి నగర్, గ్రామాలలో ఎమ్మెల్యే కాలే యాదయ్య ప్రజా ఆశీర్వాద యాత్ర నిర్వహించారు. కాలే యాదయ్యకు గ్రామ ప్రజలు, టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు, అభిమానులు మహిళలు ఘన స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలే యాదయ్య మాట్లాడుతూ…
ఒక్క నెల నాకోసం కష్టపడండి 5 సంవత్సరాలు మీకోసం కష్టపడతాను అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మొదలు నుంచి నేటి వరకు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసిఆర్ ప్రజల కోసమే అహర్నిశలు కృషి చేశారు అని అన్నారు.  కేసిఆర్ తెలంగాణ ప్రజల కోసం ఆలోచించి ప్రతి ఇంటికి 5 లక్షల బీమా చేపిస్తూ తెలంగాణ ప్రజలకు ధీమాగా ఉన్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచి మొదలు నేటి వరకు కెసిఆర్ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ పథకాల అమలు చేస్తూ రాష్ట్రాన్ని దేశంలోనే ప్రథమ స్థానంలో నిలబెట్టారని అన్నారు. ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోని కుటుంబాలన్నిటికీ ఉచితంగా 5 లక్షల బీమా చేయించడం చాలా గొప్ప విషయం అన్నారు. బిఆర్ఎస్ మేనిఫెస్టో  పేద మధ్యతరగతి కుటుంబాల కోసమే ఆలోచించి రూపొందించామని, దేశంలోనే ఎక్కడ లేని విధంగా 24 ఉచిత కరెంటు రైతులకు అందించి రైతు పక్షపాతిగా నిలిచిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని అన్నారు.

- Advertisement -

కాంగ్రెస్ కొత్తగా తీసుకువచ్చిన మేనిఫెస్టోను ప్రజలు ఎవరు నమ్మడం లేదని అన్నారు. కాంగ్రెసును నమ్మితే ప్రజలు ఆగమైపోతారని అన్నారు. నిన్న మొన్న కర్ణాటకలో జరిగిన ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమల్లో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన సౌభాగ్య లక్ష్మి పథకానికి విశేష స్పందన వస్తుందని అన్నారు. గతంలో టిఆర్ఎస్ పార్టీ పెట్టిన మేనిఫెస్టో ప్రతి ఒక్కటి అమలు చేసిందని, అందుకే ప్రజలు కేసీఆర్ వైపే ఉన్నారన్నారు అని అన్నారు.


తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ బిఆర్ఎస్ వైపే ఉన్నారని రాబోయే ఎన్నికల్లో ప్రజలంతా ఏకమై మరోసారి బిఆర్ఎస్ పార్టీని గెలిపించి కెసిఆర్ ను ముఖ్యమంత్రి చేస్తారని అన్నారు. 
అలాగే మూడవసారి ముఖ్యమంత్రి కేసీఆర్ నాకు టికెట్ ఇచ్చి చేవెళ్ల అభివృద్ధి కోసమై పంపారు మూడోసారి కూడా అధిక మెజార్టీతోనే ఆశీర్వదించాలని కోరారు.

ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టి తెలంగాణ రాష్ట్రంలోని రైతులందరికీ నీళ్లు ఇచ్చిన గొప్ప ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం అన్నారు. ఈ కార్యక్రమంలో శంకర్ పల్లి మండల బిఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News