Friday, September 20, 2024
HomeతెలంగాణKangti: మీ అందరి దీవెనలు కావాలి

Kangti: మీ అందరి దీవెనలు కావాలి

కంగ్టి మండలంలోని ఎడ్ల రేగడి తాండాలో జ్వాలాముఖి మందిరంను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు.  జ్వాలాముఖి ఆలయంలో మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ రాష్ట్రంలో.. మళ్లీ రాబోయేది కేసీఆర్ ప్రభుత్వమేనని మంత్రి జోస్యం చెబుతూ.. మీ అందరి దీవెనలు మాకుండాలన్నారు.

- Advertisement -

ప్రధాన మంత్రి సంసద్ యోజనలో పదికి పది తెలంగాణ గ్రామ పంచాయతీలే ఉన్నాయని హరీష్ తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో జిల్లా చైర్ ప‌ర్సన్ మంజుశ్రీ జయపాల్ రెడ్డి, జెడ్పిటిసి కోట లలిత ఆంజనేయులు, ఎంపీపీ సంగీత వెంకటరెడ్డి,  మంగల్ సింగ్ మహారాజ్, సర్పంచ్ గడ్డం మనోహర్, టిఆర్ఎస్ మండల అధ్యక్షులు ఎస్కే గంగారం, డిసిఎంఎస్ చైర్మన్ శివ కుమార్, ఆర్డిఓ అంబాదాస్,  రాజశేఖర్, చిన్ని బాయ్, సర్పంచ్ బన్సిలాల్, త‌హ‌సిల్దార్ ప్రవీణ్ కుమార్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News