Sunday, July 7, 2024
HomeతెలంగాణKarepalli: పేదోళ్ల బియ్యంతో పెద్దోళ్ళ దందా

Karepalli: పేదోళ్ల బియ్యంతో పెద్దోళ్ళ దందా

22 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

మండలం రేషన్‌ బియ్యం దందా ఆగడం లేదు. కొందరు వ్యాపారులు అధికారుల కళ్లుగప్పి వివిధ మార్గాల్లో బియ్యం తరలిస్తూ పేదోళ్ల బియ్యంతో సొమ్ము చేసుకుంటున్నారు. కొందరు డీలర్లు రేషన్‌ బియ్యం కోసం వచ్చిన వారి వద్దే తిరిగికొని, వ్యాపారం చేస్తుండగా, మరికొందరు లబ్ధిదారులకు ఇవ్వకుండానే ఇతర ప్రాంతాలకు తరలిస్తూ అందినకాడికి దండుకుంటున్నారు. బుధవారం నాడు విశ్వసనీయ సమాచారంతో మండల పరిధిలో గల కొమ్ము గూడెం గ్రామ పంచాయతీ పరిధిలో రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్నారనే సమాచారంతో కారేపల్లి ఎస్సై రాజారామ్ తన సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. కల్తీ బాలకృష్ణ అనే వ్యక్తికి చెందిన మహేంద్ర మినీ ట్రక్కులో సుమారు 22 క్వింటాళ్ల రేషన్ బియ్యం తరలిస్తున్న వాహనాన్ని పట్టుకుని కారేపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. డ్రైవర్ కల్తీ బాలకృష్ణపై, అక్రమ రేషన్ దందా చేస్తున్న నిర్వాహకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కారేపల్లి ఎస్సై రాజారామ్ తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News