Thursday, September 19, 2024
HomeతెలంగాణKarimnagar: కార్యకర్తలకు అండగా కాంగ్రెస్ పార్టీ

Karimnagar: కార్యకర్తలకు అండగా కాంగ్రెస్ పార్టీ

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం రామచంద్రపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త ఎగుర్లు మల్లేశం ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తో మరణించగా వారి కుటుంబ సభ్యులకు 2లక్షలు పార్టీ తరపున ప్రమాద బీమా చెక్కులను కాంగ్రెస్ నాయకుల తో కలసి అందజేసిన చొప్పదండీ నియోజకవర్గ ఇంచార్జి మేడిపల్లి సత్యం. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అంటే నాయకుల పార్టీ కాదు అని కార్యకర్తల పార్టీ అని కార్యకర్తల సంక్షేమమే పార్టీ లక్ష్యం అన్నారు. దురదుష్టవశాస్తు ఏవరికైనా ప్రమాదం సంభవిస్తే ఆ కుటుంబం రోడ్డు మీద పడకుండా పార్టీ అదుకోవాలనే లక్ష్యంతో కాంగ్రెస్ సభ్యత్వం ఉన్న ప్రతి కార్యకర్త కుటుంబానికి రూ. 2 లక్షల బీమా సౌకర్యం కల్పించడం జరిగిందిని అన్నారు. కార్యకర్త కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తే పార్టీ నాయకత్వం మీకు ఏకష్టం వచ్చిన కడుపులో పెట్టుకొని చూసుకుంటుందన్నారు.
రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కార్యకర్తల సంక్షేమం కోసం అనేక కార్యకర్తలు పార్టీ తరుపున, ప్రభుత్వం తరుపున చేపట్టడం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ కుటుంబాలు అంటే కాలర్ ఎగరేసి తిరిగే రోజులు రాబోతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బొమ్మరవెణి తిరుపతి,కొల రమేష్,పులి అంజనేయులు, రాములు గౌడ్, శ్రీనివాస్, రాజేష్ ఖన్నా, అంజయ్య, శంకర్, శేఖర్,కనుకయ్య, మహేందర్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News