Saturday, June 21, 2025
HomeతెలంగాణKarimnagar: హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి భద్రత చెక్కులు

Karimnagar: హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి భద్రత చెక్కులు

8 లక్షల ఆర్థిక సాయం

కరీంనగర్ పోలీసు కమిషనరేట్ లోని కేశవపట్నం పోలీస్ స్టేషన్ లో పనిచేస్తూ గుండెపోటుతో మృతి చెందిన హెడ్ కానిస్టేబుల్ కె.పరంధాములు కుటుంబానికి గురువారం కరీంనగర్ పోలీస్ కమీషనర్ ఎల్ సుబ్బరాయుడు ప్రభుత్వం మంజూరు చేసిన ఆర్థిక సహాయాన్ని అందజేశారు.

- Advertisement -

హెడ్ కానిస్టేబుల్ కె.పరంధాములు ఈ సంవత్సరం జూన్ 27న గుండెపోటుతో మృతి చెందారు. ప్రభుత్వం భద్రత పథకం కింద మంజూరు చేసిన 8 లక్షల రూపాయలు, కార్పస్ ఫండ్ 50 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని పోలీసు కమీషనర్ చెక్కుల రూపంలో ఆయన భార్య శ్యామల, ఇద్దరు పిల్లలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో అడ్మినిస్ట్రేటివ్ అధికారి ముని రామయ్య, సీనియర్ అసిస్టెంట్ నల్లా వెంకటేశ్వర్ రెడ్డి,సెక్షన్ క్లర్క్ రహెన సుల్తానా తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News