Saturday, April 19, 2025
HomeతెలంగాణKarimnagar: నిర్లక్ష్యం వీడని విద్యుత్ అధికారులు

Karimnagar: నిర్లక్ష్యం వీడని విద్యుత్ అధికారులు

ప్రమాదం జరిగితే బాధ్యులెవరు

విద్యుత్ శాఖ అధికారులు నిర్లక్ష్యం వీడడం లేదు. ప్రమాదాలు జరిగితే కానీ స్పందించని మొద్దు నిద్రలో ఉంటున్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న రేకుర్తి పరిధిలోని షాలేనగర్ ఈద్గా వద్ద ముస్లిం సోదరులు రంజాన్, బక్రీద్ సమయంలో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. అలాంటి ఈద్గా వద్ద మనిషికి అందే అంత ఎత్తులో విద్యుత్ తీగలు ఉన్నప్పటికీ సంబంధిత అధికారులు వాటిని సరి చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం విస్మయాన్ని కలిగిస్తుంది.

- Advertisement -

సోమవారం బక్రీద్ వేడుకను ముస్లిం సోదరులు ఈద్గా వద్ద ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహించుకునేందుకు సిద్ధమవుతున్నారు. బక్రీద్ వేడుకను నిర్వహించుకునేందుకు ఈద్గా వద్దకు వేల సంఖ్యలో వచ్చే ముస్లిం సోదరులకు ఇబ్బందులు తలెత్తకుండా విద్యుత్ శాఖ అధికారులు తక్షణమే స్పందించి విద్యుత్ వైర్లను సరిచేయాలని స్థానికులు కోరుతున్నారు. ఈ విషయంపై విద్యుత్ శాఖ అధికారులు ఏ మేరకు స్పందిస్తారో వేచి చూద్దాం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News