Sunday, July 7, 2024
HomeతెలంగాణKarimnagar: తీగల వంతెన ప్రారంభోత్సవానికి కేటీఆర్ కు గంగుల ఆహ్వానం

Karimnagar: తీగల వంతెన ప్రారంభోత్సవానికి కేటీఆర్ కు గంగుల ఆహ్వానం

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కరీంనగర్ పట్టణంలోని మానేరు వాగుపై నిర్మించిన తీగల వంతెనను ఈ నెల 17న ప్రారంభించనుండగా, ముఖ్య అతిథిగా హాజరు కావాలని రాష్ట్ర ఐటీ-పురపాలక శాఖ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను మంత్రి గంగుల ఆహ్వానించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా మంత్రి కేటీఆర్ ని సిరిసిల్లలో కలిసిన గంగుల శుభాకాంక్షలు తెలియజేశారు. మంత్రి వెంట ఎమ్మేల్యేలు రసమయి బాలకిషన్, సుంకే రవి శంకర్, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కనుమల్ల విజయ, నగర మేయర్ సునీల్ రావు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపా రాణి – హరిశంకర్, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్ తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News