Friday, April 11, 2025
HomeతెలంగాణKarimnagar: పంచాయతీ కార్యదర్శులకు సంఘీభావం తెలిపిన అజయ్ వర్మ

Karimnagar: పంచాయతీ కార్యదర్శులకు సంఘీభావం తెలిపిన అజయ్ వర్మ

కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట తమ సమస్యల పరిష్కారం కోసం నిరవధిక సమ్మె చేస్తున్న జూనియర్, అవుట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శుల సమ్మె శిబిరాన్ని బిజెపి రాష్ట్ర నాయకులు అజయ్ వర్మ సందర్శించి వారికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శులకు వెంటనే పర్మినెంట్ చేయాలని, వారి జీతాలు పెంచడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శులు, నాయకులు వాసు, నాంపల్లి శ్రీనివాస్, అల్లావుద్దీన్, కొంకటి అనిల్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News