Thursday, September 19, 2024
HomeతెలంగాణKaushik Reddy: కేబుల్ ఆపరేటర్ల గోడు

Kaushik Reddy: కేబుల్ ఆపరేటర్ల గోడు

మా సమస్యలు తీర్చమంటూ..

తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ హుజురాబాద్ నియోజకవర్గం పరిధిలోని కేబుల్ ఆపరేటర్లు దాసరి రామ్మూర్తి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. డిటిహెచ్ ప్రసారాల వల్ల తమకు పెద్ద సంఖ్యలో కనెక్షన్లు తగ్గిపోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. ప్రభుత్వం అదనంగా తమకు పోల్ టాక్స్ వేయడం వల్ల తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నామన్నారు. వరంగల్ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ పోల్ టాక్స్ రద్దు చేస్తామని హామీ ఇచ్చారని కానీ ఇప్పటి వరకు అమలు చేయడం లేదన్నారు. అధికారులతో మాట్లాడి కరీంనగర్ జిల్లాలో పోల్ టాక్స్ ను రద్దు చేయాలని కౌశిక్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కేబుల్ ఆపరేటర్ల సంక్షేమ సంఘం నాయకులు కట్టంగూరి రామ్ స్వరణ్ రెడ్డి, తిరుపతి, అంజయ్య, మధు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News