Friday, September 20, 2024
HomeతెలంగాణKaushik Reddy: నియోజకవర్గ ప్రజలే నా కుటుంబం

Kaushik Reddy: నియోజకవర్గ ప్రజలే నా కుటుంబం

కష్టసుఖాల్లోనూ మీకు తోడుగా ఉంటా

హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలే తన కుటుంబమని, వారి కష్టసుఖాల్లో తాను తోడుంటానని, కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటు వేస్తే కర్ణాటక ప్రజల కష్టాలే మనకు వస్తాయని హుజురాబాద్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. జమ్మికుంట మండలం అంకుషాపూర్, మడిపల్లి, కమలాపూర్ మండలం శ్రీరాములపల్లి, అంబాల, ఉప్పరపల్లి, ఉప్పల్ గ్రామాలలో ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలలోని ప్రధాన కూడళ్ల వద్ద ఏర్పాటు చేసిన సమావేశాలలో పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ… తెలంగాణ ఏర్పాటు నుంచి నేటి వరకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల ముఖంలో ఆనందం చూస్తుందన్నారు.

- Advertisement -

గత 20 సంవత్సరాలుగా ఏడుసార్లు ఇక్కడి ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్ ను గెలిపిస్తే నియోజకవర్గానికి చేసిందేమీ లేదన్నారు. ఉప ఎన్నికల కష్టకాలంలో కూడా గెలిపిస్తే కనీసం రెండున్నర సంవత్సరాలుగా ఒక్కసారి కూడా నియోజవర్గానికి రాకపోవడం బాధాకరమన్నారు. తనకు ఒక్క అవకాశం ఇచ్చి గెలిపిస్తే ఐదు సంవత్సరాలలోపు హుజురాబాద్ ను సిద్దిపేట తరహాలో అభివృద్ధి చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు. బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ మరోసారి పేద ప్రజల కోసం మేనిఫెస్టో రూపొందించారని, ఈ మేనిఫెస్టో పేదల కుటుంబాల్లో వెలుగులు నింపుతాయన్నారు.

రేషన్ కార్డు ఉన్న ప్రతి ఇంటికి ఇకపై అన్నపూర్ణ పథకం ద్వారా సన్న బియ్యం అందజేస్తామన్నారు. మడిపల్లి గ్రామంలో శివాలయం, దుర్గామాత ఆలయం తో పాటు మరికొన్ని అభివృద్ధి పనులు చేపడతారని అన్నారు. చెల్పూర్ నుంచి మొండికుంట వరకు వరద కాలువ నిర్మాణం కోసం రెండు కోట్ల కేటాయిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టూరిజం డెవలప్మెంట్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్, ఎంపీపీ దొడ్డే మమత, ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

✳️బిజెపి నుంచి బిఆర్ఎస్ లోకి 30 మంది యువకులు… జమ్మికుంట మండలం మడిపల్లి గ్రామంలో బిజెపికి చెందిన 30 మంది యువకులు బుధవారం పాడి కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బిఆర్ఎస్ లో చేరడం గర్వంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి బిఆర్ఎస్ తోనే సాధ్యమని, ప్రతి ఒక్కరూ ఇది గమనించి బిఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని అన్నారు.

✳️హుజురాబాద్ మేలిమి బంగారం మా కౌశిక్ అన్న ఆడియో ఆవిష్కరణ…
హుజురాబాద్ మేలిమి బంగారం మా కౌశిక్ అన్న అనే ఆడియో సీడిని బుధవారం పాడి కౌశిక్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. నిర్మాత ప్రభు ఈ పాటను చిత్రీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధిలో తనకంటూ ఒక మార్కు వేసుకున్న కౌశిక్ రెడ్డి మీద ఉన్న అభిమానంతోనే తాను ఈ పాటను రూపొందించానని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కౌశిక్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. హుజురాబాద్ మరింత అభివృద్ధి చెందాలంటే అది కౌశిక్ రెడ్డి తోనే సాధ్యమని అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News