బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈరోజు మరోమారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు విచారణకు హాజరయ్యారు. కవితతో పాటు ఆమె భర్త అనిల్, మంత్రి శ్రీనివాస్ గౌడ్, న్యాయవాది సోమ భరత్ అందరూ ఈడీ కార్యాలయంలోకి కవితతో పాటు వెళ్లారు.
- Advertisement -
ఈనెలలో ఇలా ఈడీ ఎదుట ఆమె రెండవసారి హాజరవుతున్నారు. సుప్రీంకోర్టులో తన కేసు విచారణ పెండింగ్ లో ఉందని.. ఆ ఉత్తర్వులు వెలువడేవరకూ ఈడీ ముందుకు హాజరయ్యేందుకు ఆమె మొగ్గు చూపకపోయినా ఈ విజ్ఞప్తిని ఈడీ తిరస్కరించింది. దీంతో ఆమె ఎట్టకేలకు విచారణకు హాజరయ్యారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆమె ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2023/03/Kavitha-Delhi-1024x794.jpg)
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2023/03/Kavitha-ED-2-1024x994.jpg)
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2023/03/Kavitha-6-806x1024.jpg)