బోధన్ బీసీ హాస్టల్ లో మరణించిన గాంధారి మండలం తిప్పారం తాండ కు చెందిన హర్యాల వెంకట్ రామ్ కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మాజీ ఎమ్మెల్యే జాజల సురేందర్ పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను ఓదార్చిన ఎమ్మెల్సీ కవిత, అండగా నిలుస్తామని భరోసానిచ్చారు. వెంకట్ కుటుంబ సభ్యులకు ఎమ్మెల్సీ కవిత ఆర్థిక సహాయం అందజేశారు.
- Advertisement -
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2024/03/830cb197-2b11-446b-a4d4-c72240e2416e-1024x683.jpg)
ప్రభుత్వ హాస్టళ్లలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ కవిత అధికారులను డిమాండ్ చేశారు. అంతేకాదు బాధిత కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించి, ఆర్థికంగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు.
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2024/03/44277666-28f6-442a-a71b-527a50d8d064-1024x683.jpg)