Saturday, November 15, 2025
HomeతెలంగాణKcr:మరోసారి అస్వస్థతకు గురైన కేసీఆర్‌..వైద్యుల పర్యవేక్షణలో చికిత్స

Kcr:మరోసారి అస్వస్థతకు గురైన కేసీఆర్‌..వైద్యుల పర్యవేక్షణలో చికిత్స

Kcr Health Update:బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు శనివారం అనారోగ్యానికి గురైనట్లు సమాచారం. ఎర్రవల్లిలోని తన ఫాంహౌస్‌లో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఆయనకు అకస్మాత్తుగా అస్వస్థత కలగడంతో వెంటనే హైదరాబాద్‌ నుండి ప్రత్యేక వైద్యుల బృందం అక్కడికి చేరింది.

- Advertisement -

సోడియం స్థాయిల్లో మార్పులు….

వైద్య వర్గాల సమాచారం ప్రకారం కేసీఆర్ రక్తంలో చక్కెర స్థాయులు, అలాగే సోడియం స్థాయిల్లో మార్పులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ పరిణామం తర్వాత ఆయనకు అనేక వైద్య పరీక్షలు నిర్వహించి తగిన చికిత్స అందిస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం పర్యవేక్షణలోనే కొనసాగుతోందని పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి.

తండ్రి ఆరోగ్య పరిస్థితి…

కేసీఆర్ అనారోగ్యం విషయం తెలిసిన వెంటనే ఆయన కుమారుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎర్రవల్లికి చేరుకున్నారు. తన కుమారుడు హిమాన్షుతో కలిసి ఫాంహౌస్‌కు వచ్చినట్లు తెలిసింది. ఫాంహౌస్‌కు చేరుకున్న తర్వాత ఆయన వైద్యులను సంప్రదించి తండ్రి ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు తెలుసుకున్నారు.

కేటీఆర్‌తో పాటు మాజీ మంత్రులు హరీశ్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి కూడా ఎర్రవల్లికి చేరుకున్నారు. వారు కూడా అక్కడే ఉండి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా ప్రశాంత్ రెడ్డి ఫాంహౌస్‌లోనే ఉంటూ వైద్య సేవలను పర్యవేక్షిస్తున్నారని సమాచారం అందింది.

Also Read: https://teluguprabha.net/telangana-district-news/hyderabad/gandhi-hospital-doctors-perform-a-miracle-blades-removed-without-surgery/

ప్రస్తుతం ఎర్రవల్లిలో ఉన్న వైద్యుల బృందం నిరంతరం ఆయన ఆరోగ్యాన్ని గమనిస్తోంది. కేసీఆర్‌కు అవసరమైన ఔషధాలు, చికిత్సలు ఫాంహౌస్‌లోనే అందజేస్తున్నారని వైద్యులు తెలిపారు. ఆయన ఆరోగ్య స్థితి స్థిరంగా ఉన్నప్పటికీ పూర్తిగా కోలుకోవడానికి కొంత సమయం పట్టవచ్చని భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad