ఎర్రవల్లిలోని తన నివాసంలో గురువారం రాత్రి బాత్ రూంలో కాలుజారిపడటంతో మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావుగారి ఎడమకాలితుంటి ఎముక ప్రాక్చర్ అయింది. వెంటనే సోమాజీగూడలోని యశోద ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం వారికి యశోద దవాఖానాలో డాక్టర్లు చికిత్స అందజేస్తున్నారు.
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2023/12/5f55afbe-4ba1-4ad7-a096-a2aeae111bd6-1-1024x773.jpg)
సిటీ స్కాన్ చేసిన వైద్యులు ఎడమకాలి తుంటి విరిగిందని, శస్త్రచికిత్స ద్వారా రీప్లేస్ చేయాల్సి వస్తుందని డాక్టర్లు హెల్త్ బులిటిన్ విడుదల చేశారు.
కోలుకోవడానికి ఇందుకు 6 నుంచి 8 వారాల సమయం పడుతుదని తెలిపారు.కేసీఆర్ గారి ఆరోగ్యపరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని తెలిపారు.
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2023/12/32919759-a367-49ce-8e23-44842186b1cc-1024x586.jpg)
యశోద దవాఖానాలో చికిత్స పొందుతున్న కేసీఆర్ గారి వెంట భార్య శోభమ్మ, తనయుడు మాజీ మంత్రి కేటీఆర్.. కూతురు కవిత ఎంపీ సంతోష్ కుమార్, మాజీ మంత్రి హరీష్ రావు తదితర కుటుంబ సభ్యులు ఉన్నారు.
వార్త తెలిసిన నేపధ్యం లో పరామర్శించేందుకు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు , అభిమానులు ఆస్పత్రికి భారీగా తరలివస్తున్నారు.
కాగా కెసిఆర్ కు శస్త్ర చికిత్స జరుగుతున్న నేపద్యంలో డాక్టర్స్ ఎవరిని అనుమతించడం లేదు.
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2023/12/83d05755-cfd3-42d0-a02d-5eebb4022517-1024x682.jpg)
నేతలు, అభిమానులు కార్యకర్తలు ఎవరు ఆందోళన చెందవద్దని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్పారు.
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2023/12/cf7c99d7-1d7e-40a7-a0ab-c48df144490e.jpg)