Thursday, September 19, 2024
HomeతెలంగాణKCR: సంత్ సేవాలాల్ మహారాజ్ 284 వ జయంతి శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్

KCR: సంత్ సేవాలాల్ మహారాజ్ 284 వ జయంతి శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్

లంబాడా, బంజారా ప్రజలకు సంత్ సేవాలాల్ మహారాజ్ 284 వ జయంతి శుభాకాంక్షలు తెలిపారు సీఎం కేసీఆర్. నేటి బంజారా హిల్స్ గా పిలవబడుతున్న ప్రాంతంలో, మూడు శతాబ్ధాల క్రితమే సేవాలాల్ మహారాజ్ నడయాడారని, అదే బంజారాహిల్స్ నేలమీద వారి పేరుతో నిర్మించిన భవన్లో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా వారి జయంతి ఉత్సవాలను నిర్వహించడం ఆనందంగా ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ వస్తే అణగారిన వర్గాల అస్థిత్వానికి,ఆత్మగౌరవానికి తగిన గుర్తింపు దక్కుతుందనడానికి వారి జయంతి ఉత్సవాల నిర్వహణ మరో ఉదాహరణగా నిలిచిందని కేసీఆర్ అన్నారు.
అడవి బిడ్డల ప్రత్యేకమైన ప్రకృతి ఆరాధన, ఆధ్యాత్మిక దృక్పథం, సామాజిక సాంస్కృతిక జీవన విధానాన్ని కాపాడడం కోసం వారు చేసిన కృషి గొప్పదన్నారు. తన ప్రజలను బయటి సమాజం నుంచి అనుక్షణం రక్షించుకునే దిశగా సంత్ సేవాలాల్ మహారాజ్ జీవితాంతం పోరాటం సాగించారన్నారు. ఆ దిశగా వారు కల్పించిన చైతన్యం, వారు చేపట్టిన కార్యాచరణ దేశవ్యాప్తంగా వున్న లంబాడా, బంజారాలకు రక్షణ కవచంగా నిలిచిందన్నారు. బంజారాలకు స్పూర్తి ప్రదాతగా నాటి కాలంలో వారు చేసిన కృషి, విశ్వవ్యాప్తంగా వున్న బంజారాలకు వారిని ఆధ్యాత్మిక గురువుగా, తమ ఆరాధ్య దైవంలా కొలిచేలా చేసిందని, సీఎం కేసీఆర్ అన్నారు.
హైద్రాబాద్ నగరం నడిబొడ్డున, అత్యంత ఖరీదైన ప్రాంతంలో సంత్ సేవాలాల్ మహారాజ్ పేరుతోనే బంజారా భవన్ ను వారి ఆత్మగౌరవం ఉట్టిపడేలా నిర్మించామన్నారు. అందులో సంత్ సేవాలాల్ విగ్రహ ప్రతిష్టాపన చేసామని సీఎం అన్నారు. వారి జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా అధికారికంగా నిర్వహిస్తుందని సిఎం కేసీఆర్ తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News