Saturday, October 5, 2024
HomeతెలంగాణKhammam: గ్రామపంచాయతీ వర్కర్ల రౌండ్ టేబుల్

Khammam: గ్రామపంచాయతీ వర్కర్ల రౌండ్ టేబుల్

గ్రామపంచాయతీ వర్కర్లపై చిన్నచూపు

తిరుమలాయపాలెంలో గత 13 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్న గ్రామపంచాయతీ వర్కర్లు ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీల రౌండ్ టేబుల్ సమావేశం మండల కేంద్రంలో సిఐటియు మండల కార్యదర్శి వశపంగు వీరన్న, అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఖమ్మం జిల్లా కార్యదర్శి మందుల రాజేంద్రప్రసాద్, పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం గ్రామపంచాయతీ వర్కర్లను చిన్నచూపు చూస్తుందని తక్షణమే వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని
లేనిపక్షంలో ఉద్యమాలను అనేక రీతులలో రూపాలు మారక ముందే చర్చల ద్వారా వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యులు. బెల్లం. శ్రీను,సిపిఐ యం ఎల్ ప్రజాపందా మండల కార్యదర్శి కె.నాగేశ్వరరావు, న్యూడెమోక్రసీ చంద్రన్న వర్గం మండల కార్యదర్శి తిమ్మిడి.హనుమంతరావు, యం యల్ న్యూడెమోక్రసీ మండల కార్యదర్శి గొర్రెపాటి. రమేష్, ఐ యాఫ్ టీ యు జిల్లా నాయకులు గోసు. పుల్లయ్య, మాగి.రామ్మూర్తి,మీగడ.సైదులు, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి నిరసన వెంకటేశ్వర్లు, పి ఓ డబ్ల్యు జిల్లా నాయకురాలు సరోజినీ,అరుణోదయ నాయకులు అరెంపల.వెంకన్న, వెంకటస్వామి,నవీన్, గిరిజన సమాఖ్య జిల్లా నాయకులు అజ్మీర.కిషన్ నాయక్,గుగులోతు.నెహ్రూ నాయక్, మరియు గ్రామ పంచాయతీ వర్కర్లు మండల అధ్యక్షుడు ఎండి.పాషా, ఎల్లయ్య, బషీర్ ,రవి ,మల్సూర్, రాము, మదు,ఉప్పలయ్య పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News