Thursday, September 19, 2024
HomeతెలంగాణKhammam: NTR మన ఆత్మగౌరవాన్ని నింపిన మహానుభావుడు

Khammam: NTR మన ఆత్మగౌరవాన్ని నింపిన మహానుభావుడు

మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు ప్రపంచవ్యాప్తంగా తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని నింపిన మహానుభావుడని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జూనియర్ కళాశాల ఎదురుగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని నింపిన మహానుభావుడు ఎన్టీఆర్ చలనచిత్ర రంగంలో నటుడిగా గుర్తింపు పొంది రాజకీయ రంగంలో ప్రవేశించి మంచి సేవలు అందించారని అన్నారు. నేటికీ ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచాడు. రాజకీయరంగంలో పరిపాలన ఎలా చేయాలనేది నిరూపించిన మహానుభావుడు అని ఎన్టీఆర్ ను కొనియాడారు.
నేటి ప్రజలు ఎన్టీఆర్ను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా భారీ కార్ల ర్యాలీతో సత్తుపల్లి వెళ్లారు. వైరా కమ్మ కల్యాణ మండపంలో కమ్మ జనసేవా సమితి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పొంగులేటి అనుచరులు మువ్వ విజయ్ బాబు , బొర్రా రాజశేఖర్ మున్సిపల్ చైర్మన్ సూతకాని జైపాల్ ,పణితిసైదులు,దార్నారాజశేఖర్ పలువురు నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News