Tuesday, September 17, 2024
HomeతెలంగాణKhammam: పొంగులేటి కుయుక్తులు సాగవు

Khammam: పొంగులేటి కుయుక్తులు సాగవు

పొంగులేటి కుట్రలు, కుయుక్తులు సాగవు,ప్రజలు సాగనివ్వరని ఎంపీ రవిచంద్ర హెచ్చరించారు. తన 5ఏళ్ల పదవీ కాలంలో జిల్లాకు ఏమీ చేయలేదని రవిచంద్ర పొంగులేటిపై మండిపడ్డారు. ఆయన పగటి కలలు కల్లలు చేస్తూ పదికి పది సీట్లు గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టి తీరుతం అంటూ రవిచంద్ర అన్నారు. ఎంపీ రవిచంద్ర రైతుబంధు సమన్వయ సమితి అధ్యక్షులు రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే వెంకటవీరయ్య, ఎమ్మెల్సీ మధులతో కలిసి అతిథిగా ఖమ్మం జిల్లా చెన్నూరులో జరిగిన ఆత్మీయ సభలో పాల్గొన్నారు.

- Advertisement -

సమ్మేళనంలో జెడ్పీ ఛైర్మన్ లింగాల కమల్ రాజు, డీసీఎంఎస్ ఛైర్మన్ రాయల శేషగిరిరావు, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ ఉమా మహేశ్వరరావు, కల్లూరు జెడ్పీటీసీ అజయ్ బాబు,ఎంపీపీ బీరవల్లి రఘు తదితరులు పాల్గొన్నారు.

కార్యక్రమానికి మహిళలు,యువత, బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా తరలి వచ్చారు. మాజీ ఎంపీ పొంగులేటి కుట్రలు, కుయుక్తులు సాగవని, చైతన్యవంతులైన ఖమ్మం జిల్లా ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ సాగనివ్వరని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర స్పష్టం చేశారు.ఎంపీగా 5ఏళ్ల పదవీ కాలంలో ఆయన జిల్లాకు,ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదని,ఏమీ చేయలేదన్నారు.ఆయన పగటి కలలను కల్లలు చేస్తూ జిల్లాలోని పదికి పది సీట్లను ప్రజలు బీఆర్ఎస్ ను గెలిపించడం, సగర్వంగా అసెంబ్లీలో అడుగుపెట్టడం తథ్యమని రవిచంద్ర ధీమాగా చెప్పారు.ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం కల్లూరు మండలం చెన్నూరులో బుధవారం స్థానిక ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య నాయకత్వాన బీఆర్ఎస్ కుటుంబ ఆత్మీయ సమ్మేళనం జరిగింది.ఈ కార్యక్రమానికి ఎంపీ రవిచంద్ర రైతుబంధు సమన్వయ సమితి అధ్యక్షులు, ఎమ్మెల్సీ డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి,పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాతా మధులతో కలిసి అతిథిగా హాజరయ్యారు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News