Friday, September 20, 2024
HomeతెలంగాణKhammam: 'ప్రజాగర్జన'కు తరలిన ఎర్రదండు

Khammam: ‘ప్రజాగర్జన’కు తరలిన ఎర్రదండు

కామ్రేడ్స్ ఎర్ర చొక్కాలు , మహిళలు ఎర్రచీరలు ధరించి జై సిపిఐ నినాదాలతో హోరెత్తించారు

ఖమ్మం రూరల్ మండలం నుంచి సిపిఐ శ్రేణులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ఆదివారం పెద్ద సంఖ్యలో
తరలి వెళ్లారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆధ్వర్యంలో జరగనున్న”ప్రజా గర్జన” సభ కోసం 70 బస్సుల్లో 4,000 మందితో ఎర్ర దండు కదం తొక్కింది. కామ్రేడ్స్ ఎర్ర చొక్కాలు , మహిళలు ఎర్రచీరలు ధరించి జై సిపిఐ నినాదాలతో హోరెత్తించారు. పురవీధుల్లో ఎర్రటి ఎండను సైతం లెక్కచేయకుండా డీజే నృత్యాలతో ఉత్సాహంగా చిందేస్తూ కామ్రేడ్స్ అలరించారు. దీంతో ఆయా గ్రామాలన్నీ ఎర్ర రంగునుపులుముకున్నాయి.
ఏదులాపురం నుంచి 18, గొల్లగూడెం 2, ముత్తగూడెం 4, మద్దులపల్లి 1,పొన్నెకల్లు 1, ఆరేకోడు తండా 1,పెద్ద తండా 3,తీర్థాల 1,కస్నా తండా 2,గూడూరుపాడు 5,పిట్టల వారి గూడెం 2,గుండాల తండా 1, తనగంపాడు 1,ఎం.వి పాలెం 2,పల్లెగూడెం 2, రెడ్డిపల్లి 1,రామన్నపేట 2,కామంచికల్ 6,దారేడు 3,పడమటి తండా 4,జాన్ బాద్ తండా 2 బస్సుల్లో బయలుదేరారు. ఆయా గ్రామాల్లో నాయకులు జండాలను ఊపి ప్రారంభించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News